ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న"రెండేళ్ల సుపరిపాలన - అభివృద్ధి, సంక్షేమం"ఇంటింటా ప్రచార కార్యక్రమం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు ఆత్మకూరు పట్టణంలో క్లస్టర్-06 పరిధిలోని ఆయా బూతులలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ పాల్గొని ప్రజలకు గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను, సుపరిపాలన విజయాలను, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల గురించి వివరించడంతో పాటు, స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. వీరి వెంట యూనిట్ ఇంచార్జ్ లు మోమిన్ షాకీర్, ఆన్సర్ అలీ, యూనిట్ కో కన్వీనర్లు ఎన్ఎస్. హిదాయతుల్లా, మునీర్, జిల్లా తెలుగు యువత నాయకులు పసిఫిల్ మున్నా, వార్డ్ అధ్యక్షులు రియాజుద్దీన్, వివిఎస్. మున్నా, ఖాజా, బూతు ఇంచార్జ్ లు బీ.మూర్తుజ, కార్పెంటర్ మున్నా, రఫీక్, జబిఉల్లా, జాకీర్, అజ్మద్దీన్, మాలిక్, మా భాష, పట్టణ తెలుగు యువత నాయకులు బి.షాబుద్దీన్, నూర్ బేగ్, శంషుర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News