ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల, వాల్మీకినగర్, బుద్ధానగర్ గ్రామాల రైతులు వర్షాలు లేక పంటలు మొత్తం ఎండిపోతున్నాయని మరియు భూగర్భ జలాలు కూడా తీవ్రంగా అడుగంటి పొయ్యాయని త్రాగునీటి సమస్య కూడా ఉండడం వలన, తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని రైతులు వేదనకు గురవుతున్నారు. బుద్దానగర్ గ్రామానికి చెందిన రైతు భావన శివయ్య, తదితర రైతులు ఒక ఎకరా ప్రత్తి వేసి రెండు నెలలు అయ్యిందన్నారు. విత్తనాలు విత్తిన దగ్గరినుంచి ఇంతవరకు వర్షం పది నిముషాలు కూడా పడలేదని చెప్పి, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం భీమా కట్టమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మీ సేవా కేంద్రాలలో ఎకరాకు 1700/- ప్రకారము కట్టామన్నారు. కావున ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం చేయాలని రైతులు తమ గోడు ని, బాధలను మీడియాకు చెప్పారు.
Admin
E Nivas News