ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా మరియు రాయలసీమ జిల్లాలలో పలు విత్తనసంస్థల కంపెనీలో పని చేసే ఉద్యోగుల రెండోవ నూతన కార్యవర్గం ఏర్పాటైంది కర్నూలు నగరంలోనీ, కొత్త బస్టాండ్ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నికైంది ఈసందర్భంగా పలు విత్తనాలు కంపెనీలలో పనిచేసే. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బి.చిన్నరెడ్డి, ఉపాధ్యక్షుడు గా లింగయ్య, సెక్రటరీ గా మనోజ్ రాజ్, జాయింట్ సెక్రటరీ గా శేఖర్, ట్రెజరీ గా రామిరెడ్డి, కమిటీ సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి రమేష్, రఫీ , అవినాష్ రెడ్డి, విజయ్, శివ, అశోక్, లక్ష్మీ నారాయణ, సురేష్ భగవంత్ రెడ్డి ని ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ లో ఏమైనా సమస్యలు వచ్చిన కమిటీ సభ్యులు ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని ఈసందర్భంగా తెలిపారు.
Admin
E Nivas News