ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలోని తెరిసా కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులుల పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, అడవుల ప్రాముఖ్యత మరియు వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్ లైఫ్ హెడ్ మొహమ్మద్ ఇద్రిస్ మాట్లాడుతూ పులులు అడవుల పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటికి ఎలాంటి హాని చేయకుండా వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. హనుమాన్ యాప్ ద్వారా వన్య ప్రాణులను కాపాడటం మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎఫ్ఎస్ఓ కె.జ్యోతి స్వరూప్, ఆత్మకూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ టి.రాంబాబు, ఏబిఓ లు, ప్రొటెక్షన్ వాచెర్స్ మరియు సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ సిబ్బంది ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News