ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు సబ్ యూనిట్ పరిధిలోని, ఆత్మకూరు పట్టణంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు ముగింపు వారం సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నాగేంద్రుడు మరియు హెల్త్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నాగేంద్రుడు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, నిల్వ నీటిలో దోమ లార్వాను పెరగకుండా చూసుకోవడం ద్వారా, మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఆత్మకూరు సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ దోమల కీటక నాశని ద్రావణం మనకు అందుబాటులో ఉందని ప్రతి గ్రామ పంచాయతీకి ఈ ద్రావణాన్ని అప్పజెప్పి పిచికారి చేయించడం ద్వారా డెంగ్యూ తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగేంద్రుడు, ఆత్మకూరు సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు డి.రాములు నాయక్, ఎం.పుల్లయ్య, పంచాయితీ సెక్రటరీ ప్రభాకర్, ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్, నాగులు, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News