Tuesday, 28 July 2026 04:40:00 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

డాక్టర్ బత్తుల సంజీవరాయుడు(ట్రాయ్ కాగ్ సభ్యులు)

Date : 27 July 2026 03:11 PM Views : 36

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యమని ట్రాయ్ కాగ్ సభ్యులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తెలిపారు. డోన్ పట్టణంలోని, ఐటిఐ కళాశాలలో టెలికం వినియోగదారుల అవగాహన సదస్సు పిఎస్ఎస్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాయ్ కాగ్ మెంబర్-డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మాట్లాడుతూ టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ ప్రధాన బాధ్యతల్లో సెల్ వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించడం ఒకటి అన్నారు. మెరుగైన టెలికామ్ సేవలు అందించడం కోసం సెల్ కంపెనీలు అయిన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ మొదలగు కంపెనీల సేవలపై నిబంధనలు, ఆదేశాలు, పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉత్తర్వులను జారీ చేస్తుందని పేర్కొన్నారు. టెలికామ్ రంగంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా 110 కోట్ల మంది వినియోగదారులు మనదేశంలో మెరుగైన సేవలు ట్రాయ్ ద్వారా పొందుతున్నారన్నారు. వివిధ టెలికామ్ సేవలు మరియు కేబుల్ టీవీ సేవలు నాణ్యతా ప్రమాణాలను సమర్ధవంతంగా రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనే స్వతంత్ర నియంత్రణ సంస్థను రూపకల్పన చేసి అమలులోకి తెచ్చిందని చెప్పారు. అంతేకాక ట్రాయ్ నిబంధనల ప్రకారము, టారిఫ్ సిస్టం, వ్యాపార ప్రకటనల నిశిద్ధం, సేవల నాణ్యత ప్రమాణాలు, మొబైల్ నంబర్ పోర్టబుల్టి, సౌకర్యం విలువతో కూడిన సేవలు, రక్షణ, వినియోగదారుల హక్కులు మరియు మొబైల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ ఆవిర్భావ ఆశయం అన్నారు. ప్రస్తుత తారీఫ్ ఇతర కంపెనీల కంటే తక్కువగా బిఎస్ఎన్ఎల్ ఉండడమే కాక, బిఎస్ఎన్ఎల్ లో కూడా 4జీ సేవలు రావడం ద్వారా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరెడ్డి, డిటిఓ- పురంధరప్రసాద్, టిఓ- నాగేంద్ర ప్రసాద్, ఎటిఓ- శ్రీధర్, ఎటిఓ- జగన్ , ఏఇ- నాగరాజు, వడ్డే.నాగరాజ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :