ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తాలూకా అధ్యక్షుడుగా పనిచేస్తూ నేటితో పదవీ విరమణ అయిన సి.మోహన్ రెడ్డి ని నూతన అధ్యక్షుడు ఎస్.సాజిద్ భాష శాలువా కప్పి, పూలమాల మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ నూతన తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ భాష మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో, ఉద్యోగ సంఘ నాయకునిగా సేవలను అందించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జీవోస్ నాయకులు సి.మోహన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, సహాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పూర్వపు కర్నూలు జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి తదితరులు హాజరయ్యారు. వక్తలు మోహన్ రెడ్డి సేవలను కొనియాడారు. అనంతరం మోహన్ రెడ్డి స్థానంలో ఖాళీ అయిన తాలూకా అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించి, సబ్ ట్రెజరీ అధికారి, సీనియర్ అకౌంటెంట్ ఎస్.సాజిద్ బాషాను నూతన తాలూకా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ నాయకులు, స్ధానిక ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News