ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు గ్రామంలో ఉపాధి పని చేస్తూ శ్రామికుడు మొల్ల.నిజాముద్దీన్ మృతి చెందడంతో విషయం తెలుసుకొని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో- బి.జయంతి, టిఎ- ఫయాజ్ లు అక్కడ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీవో- బి.జయంతి పని ప్రదేశాన్ని పరిశీలించి, అన్ని విషయాలు కనుక్కొని మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో ఉపాధి కూలీ మొల్ల నిజాముద్దీన్ కింద పడి హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరమని అన్నారు. శ్రామికుడు మొల్ల నిజాముద్దీన్ (వర్క్ ఐడి నెంబర్- 555794) ప్రతిరోజు పనిలో భాగంగా శనివారం ఉదయం-6 గంటల సమయంలో మద్దూరు గ్రామ సమీపంలోని పాత తుమ్ దగ్గర పనిచేస్తుండగా పని ప్రదేశంలో కింద పడిపోవడంతో సాటి కూలీలు గమనించి, ఈ విషయాన్ని మద్దూరు ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ కుమార్ కు తెలియజేయడం జరిగిందన్నారు. సంఘటన స్థలానికి అశోక్ కుమార్ చేరుకొని, మద్దూరు గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ ను సంప్రదించి ప్రథమ చికిత్స కోసం సదరు డాక్టర్ను ఆశ్రయించి పని ప్రదేశానికి తీసుకెళ్లగా మొల్ల నిజాముద్దీన్ చనిపోయాడని నిర్ధారణ చేశారు, ఈ విషయాన్ని మాకు తెలియజేయడం జరిగిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
Admin
E Nivas News