Saturday, 13 June 2026 12:07:33 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆర్.జయ శేఖర్(కొత్తపల్లి ఎస్ఐ)

Date : 08 June 2026 07:16 AM Views : 49

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని కొత్తపల్లి ఎస్సై అర్.జయ శేఖర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై ఆర్.జయశేఖర్ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల నుంచి రక్షణ పొందడానికి మరియు ఆన్‌లైన్ భద్రతను పాటించడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా నకిలీ ఏపీకే ఫైల్స్ మరియు అనధికారిక యాప్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎందుకంటే వీటి ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు హ్యాక్‌ అయ్యి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందనీ అన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్‌ఎమ్‌ఎస్ లేదా సోషల్ మీడియా లింకుల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ లోన్‌లు లేదా ప్రభుత్వ పథకాల పేరిట ఈ -చలనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎం కిసాన్, ట్రాఫిక్ చలానాలు ఇన్విటేషన్ లింకులు పంపిస్తారన్నారు. అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రోజుకో ఓ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వ జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :