ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని కొత్తపల్లి ఎస్సై అర్.జయ శేఖర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై ఆర్.జయశేఖర్ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల నుంచి రక్షణ పొందడానికి మరియు ఆన్లైన్ భద్రతను పాటించడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా నకిలీ ఏపీకే ఫైల్స్ మరియు అనధికారిక యాప్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎందుకంటే వీటి ద్వారా స్మార్ట్ఫోన్లు హ్యాక్ అయ్యి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందనీ అన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా లింకుల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ లోన్లు లేదా ప్రభుత్వ పథకాల పేరిట ఈ -చలనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎం కిసాన్, ట్రాఫిక్ చలానాలు ఇన్విటేషన్ లింకులు పంపిస్తారన్నారు. అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రోజుకో ఓ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వ జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని తెలిపారు.
Admin
E Nivas News