ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఈరోజు జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని, కొత్తగా మంజూరైన పింఛన్ ముంతమ్మ బాయి కి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కంభం మోహన్ గౌడ్ గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులైన వృద్ధుల, వితంతువుల, దివ్యాంగుల, బెడ్ పేషెంట్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే మా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, సమయపాలనతో పెన్షన్లను నేరుగా ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, గ్రామ సచివాలయ సిబ్బంది ఖాసీం, టిడిపి నాయకులు గంటా రమేష్, ధర్మవరం మల్లికార్జున నాయుడు, మాజీ సర్పంచ్ వెంకటసుబ్బమ్మ, శంకర్ రాములు నాయక్, మద్దూరు వెంకటస్వామి, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News