ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల రెవెన్యూ కార్యాలయంలో పదవి విరమణ పొందిన విద్యపోగు భాస్కర్ కు, ఆయన సతీమణికి తహసిల్దార్- జి.సుభద్రమ్మ, బండిఆత్మకూరు తహాసిల్దార్- పద్మావతి, డిప్యూటీ తహాసిల్దార్- పఠాన్ బాబు, సర్వేయర్ డిటి- వి.సుప్రియ, ఆర్ఐ- డి.ఖాజా బి, కొత్తపల్లి ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో- విమలమ్మ, రీ సర్వేయర్ కళిముల్లా, జన సైనికుడు జనసేన రాము, తదితర రెవెన్యూ సిబ్బంది శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల సర్వేయర్ విద్యపోగు.భాస్కర్ అందరు సిబ్బందితో కలిసి విధి నిర్వహణలో సిన్సియార్టీగా పనిచేసిన మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన 31 సంవత్సరాల సర్వీసులో 11 మండలాలలో, 21 మంది తహసిల్దార్ల దగ్గర పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగిందన్నారు. అనేక రైతు సమస్యలను సామరస్యంగా పరిష్కరించి అందరికీ చేదోడు వాదోడుగా ఉండడం జరిగిందన్నారు. ఆయన శేష జీవితం మంచి ఆయురోగ్యాలతో మంచిగా గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు, వీఆర్వోలు, వి ఏ వోలు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News