Sunday, 13 September 2026 12:00:34 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం...

ఆధార్ కార్డులు లేక ఆగిపోయిన సంక్షేమ ఫలాలు..! ఐటీడీఏ అధికారులు స్పందించాలన్న జవహర్ నాయక్

Date : 01 June 2026 10:28 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, రుద్రకోడూరు చెంచుగూడెంకు చెందిన ఒక చెంచు గిరిజన కుటుంబం ఆధార్ కార్డులు లేక, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతమని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రుద్రకోడూరు చెంచుగూడెంలో పర్యటించి స్థానిక చెంచు గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నాయక్ మాట్లాడుతూ రుద్రకోడూరు చెంచుగూడెంకు చెందిన గుళ్ళ ఈదమ్మ, ఆమె కుటుంబ సభ్యులు గుళ్ళ వెంకటేష్, గుళ్ళ మూగెమ్మ, గుళ్ళ తాండ్రిటి, దాసరి అంకమ్మలు 2007వ సంవత్సరంలో జీవనోపాధి కోసం గుంటూరు జిల్లా వెల్దూర్తి మండలంలోని గంగిరెడ్డి కుంట చెంచు కాలనీకి వలస వెళ్లారని తెలిపారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు జీవనం కొనసాగించిన తరుణంలో, ప్రమాదవశాత్తు వారి గుడిసె కాలిపోయిందని, ఆ మంటల్లోనే వారికి సర్వస్వమైన ఆధార్ కార్డులు కూడా బూడిదయ్యాయని పేర్కొన్నారు. తిరిగి 2014వ సంవత్సరం నుంచి వారు రుద్రకోడూరు చెంచుగూడెంలోనే నివాసం ఉంటున్నప్పటికీ నిరక్షరాస్యత, అవగాహన లోపం వల్ల తిరిగి ఆధార్ కార్డులు చేయించుకోలేకపోయారని నొక్కి చెప్పారు. ఫలితంగా వీరికి ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదని, పొట్టకూటి కోసం శ్రీశైలం క్షేత్రం భక్తుల వద్ద, కాలినడకన వెళ్లే భక్తుల వద్ద బిచ్చమెత్తుకొని దీనంగా జీవిస్తున్నామని ఆ బాధితులు కన్నీరు మున్నీరయ్యారని జవహర్ నాయక్ వివరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడచినా, అడవి బిడ్డలకు మాత్రం ఇంకా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా అందకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సంబందించిన ఐటీడీఏ అధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి, నల్లమల అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో దీనస్థితిలో గడుపుతున్న చెంచు గిరిజనుల పరిస్థితులపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ఆయన కోరారు. ఆధార్ కార్డులు లేని వారికి వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే సదరు నిరుపేద గిరిజన కుటుంబాలకు సొంత గృహాలు నిర్మించి, జీవనోపాధి కల్పించేలా ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకోవాలని, అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చెంచు గిరిజనుల సమస్యలు గుర్తించి, పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :