ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్ ల ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ మండల స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కమతం శంకర్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారి ద్వారా ఏ ఏ ఓట్లను తొలగించ వచ్చు, కొత్త వారికి (18సం నిండిన) ఓటర్ల జాబితాలో చేర్చుటకు ఉన్న విధి విధానాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్చార్జి ఏ.షహబుద్ధిన్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ప్రతిష్టమకంగా తీసుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు మార్గదర్శిగా ప్రతి ఓటర్ కు, బూత్ లెవెల్ అధికారికి అనుసంధానంగా ఉంటూ, ప్రతి ఓటర్ ను క్షుణంగా పరిశీలించి వారికి ప్రాథమిక హక్కును కల్పించి, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరద స్వామి ప్రాజెక్ట్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లు రాజారెడ్డి, దినకరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నబి రసూల్, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కన్వీనర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News