ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయం దగ్గర ఇక్కడి నుండి వెలుగోడు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళుతున్న ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షా అలీ, మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, వైయస్సార్సీపి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ బాషా, వాల్మీకి సంఘం నాయకులు తిరుపతయ్య లు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఎస్.షేక్షాఅలీ(కాంగ్రెస్), కో ఆప్షన్ మెంబర్ ఎస్.ముర్తుజాఅలీ, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు, కే.అంకన్న(మాల మహానాడు), సయ్యద్ బాషా (వైఎస్ఆర్సిపి), సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, జూటూరు తిరుపతయ్య (వాల్మీకి) లు మాట్లాడుతూ మన కానిస్టేబుల్ ఏ.ఖాజా ఏ పోలీస్ స్టేషన్లో పనిచేసిన కూడా తన విధులు సిన్సియారిటీగా నిర్వహిస్తూ, నీతి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, సామరస్యంగా పనిచేయడం జరిగిందన్నారు. ఆయన సేవలను గుర్తించి గత స్వాతంత్ర దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్ ఉత్తమ పోలీస్ ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఆయన నేను పోలీస్ కథ అనే గర్వం లేకుండా అధికారులతో, ప్రజా ప్రతినిధులతో, ప్రజా సంఘాల నాయకులతో, ప్రజలతో స్నేహ పూర్వకంగా ఫ్రెండ్లీ పోలీసు కు నిదర్శనంగా ఉత్తమ సేవలు అందించడం ఎంతో గర్వకారణం అన్నారు. ఆయన భవిష్యత్తులో ప్రమోషన్లు పొంది ప్రజలకు ఒక మంచి పోలీసు అధికారి గా సేవలందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రగూడూరు టిడిపి నాయకుడు మంజుల నాగార్జున, ప్రజా సంఘాల నాయకులు మైమాకర్, జాకీర్, సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు, మోసే, నాగ స్వామి నాయక్, ఎస్.షర్పద్దీన్ అలీ, మహబూబ్ బాషా, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News