ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్లో నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు రక్షణ కల్పించే ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలువవలసిన కూటమి ప్రభుత్వం భారతదేశ సమగ్రతను కాపాడవలసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయిన నెల మే నెలలో గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ఎంతోమంది హోటల్లో ఉన్న వ్యాపారస్తులకు ముఖ్యంగా మహిళలకు నష్టం కలిగించడమే కాకుండా మరొక్కసారి ఈ జూన్ నెలలో కూడా 29 రూపాయలు గ్యాస్ ధరలను పెంచి మరొక్కసారి వెన్నుపోటు పొడిచారని ఈ విషయంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయమని నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేకుంటే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ ప్రజలే ఆందోళన చేసి నరేంద్ర మోడీనిగద్దె దించే వరకు నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము అని అన్నారు. ఈ విషయంలో ఒకటే కాదు ప్రతి విషయంలో నరేంద్ర మోడీ ని దేశ ప్రజలు బాగా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే మంచి తీర్పు ఇవ్వాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఇటువంటి ప్రధానమంత్రి దేశ ప్రజలకు అవసరమా అని మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజవర్గ ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News