ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్-4 నుండి 12 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News