ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోడ్డు మార్గం ద్వారా అల్లూరు గ్రామం నుండి నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోనీ, మిడ్తూరు రోడ్డులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు సైకిల్పై నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య, నాయకులు, అధికారులతో కలిసి 8కెఎం వరకు ప్రయాణించడం జరిగింది. అనంతరం మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. “భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలి. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, విద్యుత్ను ఆదా చేయడం వంటి చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ప్రకృతి పరిరక్షణ పట్ల నా నిబద్ధతను కార్యరూపంలో చూపిస్తూ సైకిల్పై ప్రయాణించడం ద్వారా ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు యువతకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటమైనది అన్నారు.
“పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, lనందికొట్కూరు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, పీఏ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News