Thursday, 30 July 2026 02:28:34 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు

Date : 23 November 2025 04:48 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : హాస్టల్ విద్యార్థులకు భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- లింగాల.నాగరాజు హెచ్చరించారు నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయలు, నిత్యవసర వస్తువులు, బియ్యం పరిశీలిస్తూ డీవీఎంసీ మెంబర్- లింగాల.నాగరాజు మాట్లాడుతూ హాస్టల్లో కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి కూరలు వండాలని ఆయన అన్నారు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని మధ్యాహ్న భోజనం చికెన్, మజ్జిగ, గోంగూర, చట్నీ ప్రభుత్వమిచ్చిన మెనూలో ఉండగా చికెన్ కర్రీ మాత్రం చారు చారు చేసి అన్నంలో కూడా కలవకుండా నీళ్లు నీళ్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు ఎక్కువ రోజులు నిలువ ఉంచకుండా, ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి కూరలు వండాలని ఆయన హెచ్చరించారు. భోజన విషయంలో పిల్లలకు సమయానికి పెట్టాలని, నిర్లక్ష్యం చేస్తే సహించమని విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించి, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా హాస్టల్ వార్డెన్స్ చూసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :