Friday, 11 September 2026 08:13:15 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

444వ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల విశేష స్పందన

డాక్టర్ ఎం.రాజు(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాములపాడు మండల అధ్యక్షుడు)

Date : 06 September 2026 02:46 AM Views : 68

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో కర్నూలు అమీలియా హాస్పిటల్ వారి సౌజన్యంతో మమత పాలి క్లినిక్ & ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాజు, కుటుంబ సభ్యులు ఎం.రాధమ్మ, బిహెచ్ఎంఎస్ & సి సి ఎం డాక్టర్ ఎం.రాజేష్, ఎంబిబిఎస్ డాక్టర్ ఎం.మమత ల ఆధ్వర్యంలో నిర్వహించిన 444వ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఐ ఆర్ సి ఎస్ పాములపాడు మండల అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాజు, మమత పాలిక్ క్లినిక్ ఎంబిబిఎస్ డాక్టర్ ఎం.మమత, బిహెచ్ఎంఎస్ & సీసీఎం డాక్టర్ ఎం.రాజేష్ లు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో అమీలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సి.లక్ష్మీప్రసాద్, వారి వైద్య సిబ్బంది సహకారంతో కంటి శుక్లము, గుండె జబ్బులు, గర్భిణీ స్త్రీలు, బిపి,షుగర్ ఉన్నవాళ్లు, మోకాళ్ళ నొప్పులు, వరిబీజము, హెర్నియా, చెవి ముక్కు సమస్యలు గల రోగులకు మరియు అత్యంత ఖరీదైన గుండె పరీక్షల 2డి ఏకో, ఈసీజీ, ఆర్ బి ఎస్, హెచ్ బి శాతం, బిపి చెకప్, కంటి చెకప్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. నయం కానీ జబ్బులకు కర్నూలు అమీలియా హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది. మమత పాలి క్లినిక్ డాక్టర్ ఎం.రాజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు, ప్రజలందరికీ, కర్నూలు వైద్య సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు అమీలియా హాస్పిటల్ డాక్టర్ రామ్మోహన్ నాయుడు, డాక్టర్ గణేష్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనిజారితీ, కే.వరప్రసాద్, 2డి ఏకో నిపుణులు ఎస్.సోమన్న, అమీలియా హాస్పిటల్ వైద్య సిబ్బంది, సోషల్ మీడియా ప్రతినిధి కే.సాయి కృష్ణ, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :