ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న బాలికల హాస్టల్ నిర్మాణ పనులను ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మాలిక వసతుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కాంట్రాక్టర్ వివరాలు కోరగా ఈ నిర్మాణానికి 2 కోట్ల, 80 లక్షల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతుందని వారు డైరెక్టర్- జి.నాగముని కీ వివరించారు. రాష్ట్ర విద్య సంక్షేమం & మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి. నాగముని మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు విద్యార్థులకు చదువుతోపాటు వారి సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారని అని అన్నారు. హాస్టల్ నిర్మాణ పనులు మీరు ఒప్పుకున్న కాంట్రాక్ట్ ప్రకారం మంచి నాణ్యమైన కడ్డీలు సిమెంటు, కంకర, పిల్లర్లను క్యూరింగ్ చేయడం వంటి పనులను నాణ్యమైన గా ఉండాలని, మీరు కాంట్రాక్టులో ఉన్న అగ్రిమెంట్ పనులు చేయకుండా, నాసిరకమైన సిమెంటు, కడ్డీలు వాడినట్లు తమ దృష్టికి వస్తే, తక్షణమే పైఅధికారులకు తెలియజేసి, మీ కాంట్రాక్టర్ ను రద్దు చేస్తామనీ ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు.
Admin
E Nivas News