ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమం వేగంగా కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో మొత్తం 63255 సంతకాలు పూర్తి కావడం విశేషం అని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ సంతకాలతో నిండిన కరపత్రాలను జిల్లా కేంద్రానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని మాజీ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల స్పందనతో మహా విజయవంతమవుతోందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ ఉద్యమాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, చురుకుగా పాల్గొంటున్నారు అని,ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం, ప్రజల హక్కుల కోసం ఈ సంతకాల సేకరణ చాలా ముఖ్యమైనదని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సిపి నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్, మైనార్టీ నాయకులు అంజాద్ అలీ, మోమిన్ మునీర్ భాష, బిసి సెల్ అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, కలిసి సంతకాల సేకరణను అవిరామంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఆశలు – అభిరుచులు ప్రభుత్వానికి చేరేలా ఈ కోటి సంతకాల ఉద్యమం బలంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News