Tuesday, 28 July 2026 07:53:52 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కోటి సంతకాల సేకరణ - కరపత్రాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

Date : 10 December 2025 08:18 PM Views : 234

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమం వేగంగా కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో మొత్తం 63255 సంతకాలు పూర్తి కావడం విశేషం అని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ సంతకాలతో నిండిన కరపత్రాలను జిల్లా కేంద్రానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని మాజీ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల స్పందనతో మహా విజయవంతమవుతోందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ ఉద్యమాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, చురుకుగా పాల్గొంటున్నారు అని,ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం, ప్రజల హక్కుల కోసం ఈ సంతకాల సేకరణ చాలా ముఖ్యమైనదని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సిపి నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్, మైనార్టీ నాయకులు అంజాద్ అలీ, మోమిన్ మునీర్ భాష, బిసి సెల్ అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, కలిసి సంతకాల సేకరణను అవిరామంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఆశలు – అభిరుచులు ప్రభుత్వానికి చేరేలా ఈ కోటి సంతకాల ఉద్యమం బలంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: