Thursday, 30 July 2026 01:15:44 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోనీ పర్యావరణాన్ని కాపాడాలి

జి .నాగముని(ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్), మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి

Date : 16 November 2025 08:40 AM Views : 174

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూల్ పట్టణంలోని, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటుచేసిన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి లు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిసరాల పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలిపారు. అపరిశుభ్రత వల్ల వాయు కాలుష్యం మరియు గుండె,రక్త ప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. గాలిలోని సూక్ష్మ కణాలు రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయన్నారు. దీనివల్ల గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అలాగే పట్టణంలో పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహణ కల్పిస్తూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు, మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ ను నిరోధించాలనీ, ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలన్నారు. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ - ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. విద్యార్థులు కూడా మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా మంచి పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కేంద్రీయ విద్యాలయం ఆవరణలో తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతానని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం స్వచ్చంద్ర స్వచ్ఛ దివస్ గురించి విద్యార్థులతో, అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, ఓర్వకల్ మండల కన్వీనర్ నాగిరెడ్డి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు శ్రీకాంత్, వీరేంద్ర ,అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: