ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి తేనే నాగరాజు ల ఆదేశాల మేరకు మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాములపాడులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్.షేక్షాఅలీ ఎస్ఐఆర్ సర్వే చేస్తున్న బిఎల్ఓ గౌస్ బాషా (208)బూత్. బిఎల్ఓ బాసుర్ బీ (207)బూత్ ల లో సర్వే ఎంతవరకు జరిగిందనీ అడిగి తెలుసుకోవడం జరిగింది. బూత్ నంబర్ 207, మరియు 208 ల లోని ఎన్ని డిజిలేషన్ లను అప్లోడ్ చేశారని అడగడం జరిగింది. బూత్ నంబర్ 207లో డెత్ ఓట్లు 42 ఉన్నాయని, 34 డబుల్ ఓట్లు ఉన్నాయని, 90% డిజిటలేషన్ చేయడం జరిగిందన్నారు. బూత్ నంబర్- 207, 208 లలో ఈరోజు మిగిలిన ఓట్లు డిజిటలేషన్ పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశించారని అన్నారు . ఇంకా మిగిలినవి కూడా పూర్తి చేయడం జరుగుతుందనీ బిఎల్వోలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు-సయ్యద్.షేక్షాఅలీ గ్రామపంచాయతీలో మరియు మండలంలోని, ఎవరి ఓట్లు కూడా ఎస్ఐఆర్ సర్వేలో పోకుండా చూడాలని, పేర్లు కూడా ఇంగ్లీషులో తప్పులు పోకుండా చూడాలని బివోల్వోలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు గౌస్, భాసుర్ బి, శివన్న, లింగస్వామి, బిఎల్ఎ లు, తళారీ బాషూ, వాసు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News