ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు, కొత్తపల్లె, పాములపాడు మండలాలలో వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని ఆత్మకూరు ఎలక్ట్రికల్ ఏడి ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ మే నెలలో కురిసిన వర్షాల వల్ల ముందస్తు వ్యవసాయం చేసి మొక్కజొన్న ,పత్తి, వరి, మిర్చి కూరగాయలు తదితర పంటలు వేశారనీ జూన్, జూలై నెలలో వర్షాలు ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో, తీవ్రమైన ఎండలకు పంటలు ఎండిపోతున్నాయన్నారు. గత రెండు సంవత్సరాలు పంటలు సరిగా రాక వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేయనందు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో పాత అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేసి ఎంతో ఆశతో ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురవుతుందన్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటితో పంటలు కాపాడుకుందాం అంటే కరెంటు సక్రమంగా ఉండకపోవడం వల్ల ఉన్న నీటిని పంటలకు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఎలక్ట్రికల్ అధికారులు నాణ్యమైన కరెంటును పగలే 9 గంటలు కరెంటు అందివ్వాలని, గృహ అవసరాలతో సంబంధం లేకుండా, వ్యవసాయానికి ప్రత్యేక లైన్ల ద్వారా కరెంటు అందించాలని ఎలక్ట్రికల్ ఏడి ని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆత్మకూరు ఎలక్ట్రికల్ ఏడీ మాట్లాడుతూ పగలే 9 గంటల కరెంటును సప్లై చేస్తామని లైన్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి, రైతులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యం.వీరన్న పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షుడు ఏం.మహబూబ్ బాషా, బాల యేసు, అంబయ్య, జమాల్ ఖాన్, రాజమ్మద్ రబ్బాని, బి.హిదాయతుల్లా, ఏసన్న, రంగస్వామి, దేవకుమార్ పాల్గొన్నారు.
Admin
E Nivas News