Friday, 11 September 2026 10:26:30 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి...

జడ్పిటిసి, ఎంపీటీసీ, పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని సిద్ధం చేసుకోవాలి :- జి.రాజకుమారి గణియా(జిల్లా కలెక్టర్)

Date : 19 August 2026 08:39 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జి.రాజ కుమారి గణియా, డీపీఓ, జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల పరిస్థితి, మౌలిక వసతులు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా మాట్లాడుతూ... జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారీ, బ్యాలెట్ బాక్సుల సమీకరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయని వివరిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :