ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ నందు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, నాగ సురేష్ మోహన్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ వారు మాట్లాడుతూ రాష్ట్ర మహిళా హోం మంత్రి వంగల పూడి అనిత ని కించపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ అవమానించిన అవమానించినటువంటి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర మహిళలు అందరినీ అవమానపరిచినట్లేనని వారన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను అడ్డుకుంటామని వారు మండిపడ్డారు. ఇంత జరుగుతున్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అంబటి రాంబాబును ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుందని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి రాష్ట్ర మహిళలను గౌరవించాలని వారు అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు మహిళలను చులకన భావంతో మాట్లాడుతున్నారని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అగౌరపరిచి అవమానించినట్లేనని, మరొకసారి ఇలాంటి చౌకబారు ప్రకటన చేస్తే సహించమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమార్ రాజా, వేణు, వంశీ నవీన్ స్వాములు, వేణు కడియం సంపత్, ప్రకాష్, సామేలు, రమేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News