Tuesday, 28 July 2026 10:55:22 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

చెలిమిల్ల గ్రామంలో మొక్కజొన్న, మినుము పంటపై గడ్డి మందు కొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకొని, నాకు నష్టపరిహారం ఇప్పించి, న్యాయం చేయాలి

లక్ష్మీనారాయణ కౌలు రైతు

Date : 18 December 2025 10:35 PM Views : 411

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, చెలిమిల్ల గ్రామంలో సర్వే నెంబర్ 41/బిలో ఉన్న 6.81 సెంట్ల మొక్కజొన్న, మినుము పంటపై దుండగులు గడ్డిమందు కొట్టి నాశనం చేశారని కౌలు రైతు జి.లక్ష్మీనారాయణ, తండ్రి ప్రసాద్ విలేకరులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు జి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను చెలిమిళ్ళ గ్రామంలోని జి.మురళి, తండ్రి ఎల్ల స్వామి కి చెందిన 41/బీలో ఉన్న 6.81 సెంట్ల పొలాన్ని రెండు లక్షల రూపాయలకు కౌలుకు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో నాలుగు ఎకరాలు మొక్కజొన్న, 2.81 సెంట్ల లో మినుము పంట వేయడం జరిగిందన్నారు. ఈ పంటలకు 2 లక్షల, 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. అయితే ఈనెల 17 బుధవారం రోజున రాత్రి సమయంలో నాకు పంటలు బాగా పండుతున్నాయని ఓర్చలేక వల్లపు రెడ్డి.విజయ భాస్కర్, తండ్రి వెంకటస్వామి నా మొక్కజొన్న, మినుము పంటపై గడ్డి మందు కొట్టారని ఆరోపించారు. గతంలో కూడా ఈ విధంగానే గడ్డి మందు కొట్టి నాశనం చేసి భయభ్రాంతులకు నన్ను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపి నాకు పంట నష్టం కలిగించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకొని, నాకు నష్టపరిహారం ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :