Tuesday, 28 July 2026 07:41:43 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఎన్‌టీఆర్ జిల్లా డీపీఆర్‌వోగా బాధ్యతలు స్వీకరించిన తలుపుల నాగేశ్వరరావు

Date : 08 July 2026 11:49 PM Views : 52

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : పశ్చిమగోదావరి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించి, పదోన్నతిపై ఎన్‌టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్‌వో)గా బాధ్యతలు స్వీకరించిన తలుపుల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నూతన డీపీఆర్‌వోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రభుత్వం–ప్రజల మధ్య సమర్థవంతమైన వారధిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ విధానాలను వేగవంతంగా, కచ్చితంగా, విస్తృతంగా ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి లబ్ధిదారునికీ పూర్తిస్థాయిలో చేరేలా సమర్థవంతమైన సమాచార ప్రసారానికి ప్రాధాన్య‌మివ్వాల‌న్నారు. ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో సమాచార ప్రసారంలో విశ్వసనీయత, పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యమిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిలో సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక గుర్తింపు పొందేలా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఐపీఆర్‌వో కేవీ ర‌మ‌ణ‌రావు, డివిజ‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, వీవీ ప్ర‌సాద్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: