ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ దారా సుధీర్ ఆదేశాల మేరకు మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా పాములపాడు మండలంలోని, చెలిమిల్ల గ్రామములో వైస్సార్సీపీ ఆర్ టి ఐ మండల అధ్యక్షులు ఎస్.శివలింగం సచివాలయంలో బిఎల్ఓ జాహిద్ తో సర్వే ఇంతవరకు జరిగిందనీ అడిగి తెలుసుకోవడం జరిగింది. బూత్ నంబర్ 213,మరియు 214 ల లోని ఎన్ని డిజిలేషన్ లను అప్లోడు చేశారు అని అడగడం జరిగింది. బూత్ నంబర్ 213 లో 637 కు గాను, 420 డిజిటలేషన్ చేయడం జరిగిందన్నారు. బూత్ నంబర్- 214లో 620కి గాను, 250 డిజిటలేషన్ చేయాడం జరిగిందన్నారు. ఇంకా మిగిలినవి కూడా రెండు రోజులలో పూర్తి చేయడం జరుగుతుందనీ బిఎల్వోలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ఆర్.టి.ఐ మండల అధ్యక్షుడు ఎస్.శివలింగం ఎస్ఐఆర్ ఫారాలను పరిశీలించడం జరిగింది. చెలిమిళ్ళ గ్రామపంచాయతీలోని ఎవరి ఓట్లు కూడా ఎస్ఐఆర్ సర్వేలో పోకుండా చూడాలని బివోల్వోలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, బిఎల్ఎ లు, వైసిపి కార్యకర్త డేవిడ్, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News