ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామానికి చెందిన మావిళ్ళ నారాయణ కి 2,00,000/- రూపాయలు, ఫైనాన్షియల్ అసెస్మెంట్ క్రింద (డెత్) బట్టు.సుంకిరెడ్డి కి 2,00,000/- రూపాయిలు, దాసరి సంజ రాయుడు (డెత్) కి 1,00,000/- రూపాయలు, మిడ్తూరు మండల పరిధిలోని, చౌట్కూరు గ్రామం మరియు సుంకేసుల గ్రామానికి చెందిన వడ్డే. లోకేశ్వరి కి 23,920/- రూపాయలు, కేడెపు.మద్దిలేటి కి 52,768/- రూపాయల మంజూరైన చెక్కులను నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర.శివానంద రెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర మాండ్ర.సురేంద్రనాథ్, మార్కెట్ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ వంగల శివరామిరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్, నరసింహ గౌడ్, శబ్బు, రామ్ భూపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, పాములపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు షేక్.కరీం బాష, ప్రభుత్వ అధికారులు నాయకులు,కార్యకర్తలు, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News