ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామ రైతుల భూములు ఆన్లైన్ చేయాలని కోరుతూ ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ కులాల రైతులందరితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని బైరాపురం రైతులందరూ కూడా పొలాలలో అనుభవంలో ఉన్నారని, కానీ వీరి పొలాలను ఆన్లైన్లో ఎక్కించడానికి అధికారులు ఆలస్యం చేస్తున్నారని, కనుక మీరు ప్రత్యేక చర్య తీసుకుని త్వరగా చేపించే విధంగా చూడాలని, రైతుల సమస్యలను కలెక్టర్-ఏ.సిరి కి వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్ మండల టిడిపి కన్వీనర్ నాగిరెడ్డి, బైరాపురం రైతులు రవికుమార్, వెంకటరామిరెడ్డి, గొల్ల పెద్ద ఎల్లయ్య, దానమయ్య, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, మహేంద్ర, శంకర్, ఉసిరయ్య, హుస్సేనయ్య, మరికొంతమంది రైతులు పాల్గొని మా యొక్క భూమి ఆన్లైన్ చేయవలసిందిగా కోరడం జరిగింది.
Admin
E Nivas News