ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో పి ఆర్ టి యు నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్, డైరీలను గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, & ఆత్మకూరు మండల విధ్యాధికారులు(ఎంఈఓ లు) మేరీ మార్గరెట్, ఎం.అయూబ్ అహ్మద్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ అందరికీ పేరుపేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిఆర్టియు రూపొందించిన డైరీ క్యాలెండ్, టేబుల్ క్యాలెండర్లు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా వుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్.ఇబ్రహీం, పి.నూర్ మొహమ్మద్, దామరేకుల రవి, హుస్సేన్ సాహెబ్, రషీద్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, సయ్యద్.కలిముల్లా, శ్రీనివాసులు, హరినాథ్ బాబు, మొయినుద్దీన్, నాయకులు షఫీఉల్లా, రఫీక్, గౌస్, మహేశ్, శ్రీను, కరీం, సమద్ , నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News