ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు రైతు సేవా సహకార సంఘం నందు సీఈఓ ఎస్.ముర్తుజావలి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన జెండాను సొసైటీ చైర్మన్-వాడాల కే.జనార్దన్ రెడ్డి, డైరెక్టర్లు, సభ్యులు, నాయకులు, రైతులతో కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మద్దూరు సొసైటీ చైర్మన్-కే.జనార్దన్ రెడ్డి, సీఈవో-ఎస్.ముర్తుజావలి లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు వారోత్సవాలు జరుగుతాయని అందులో భాగంగా ఈరోజు మద్దూరు సొసైటీ నందు ఘనంగా సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని, రైతులు అందరూ వారికి కావలసిన ఎరువులు, పంట రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలు రైతులకు అందిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలియజేశారు, నీటి సంఘ అధ్యక్షులు జి.తిమ్మారెడ్డి మాట్లాడుతూ రైతులు సొసైటీ అందిస్తున్న సేవలను వినియోగించుకొని, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లు వీర కృష్ణుడు, బసిరెడ్డి, అరుణమ్మ, మద్దూర్ సొసైటీ సీఈవో- ఎస్.ముర్తుజావలి, సొసైటీ సిబ్బంది జి.కిరణ్, ఎస్.మునిమ్, రేగడగూడూరు సొసైటీ సిబ్బంది మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News