Saturday, 12 September 2026 10:22:06 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

నందికొట్కూరులో ఈనెల 21న నిర్వహిస్తున్న సామాజికవేత్త అబుబక్కర్ సంస్మరమణ సభలో భారీ సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయండి

Date : 20 December 2025 07:33 AM Views : 253

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నంద్యాల జిల్లా ఆవాజ్ కమిటీ అధ్యక్షులు & సంఘసేవకుడు కీర్తిశేషులు అబుబక్కర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పట్టణ కమిటీ సభ్యులందరూ సమావేశమై ఈ నెల 21వ తేదీ ఆదివారం ఆత్మకూరు రోడ్డులో ఉన్న రాయల్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న సంస్మరణ సభ ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహిమాన్, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని, అన్ని మండలాల నుంచి అవాజ్ కమిటీ సభ్యులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, ఆత్మీయులు, మిత్రులు, సన్నిహితులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ ఈ సంతాప సభకు తప్పకుండా హాజరుకావాలని కోరడమైనది. ఈ సంస్కరణ సభకు మాజీ ఎమ్మెల్యే& ఆవాజ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఏ.గఫూర్ మరియు ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా చిస్తి, లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ రావడం జరుగుతుందని అన్నారు. ఈ సభకు సంఘ సేవకుడు అబుబక్కర్ సానుభూతి పరులందరూ తప్పకుండా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆవాజ్ పట్టణ నాయకులు అబ్దుల్లా, పెయింటర్ రఫీ, మహబూబ్ బాషా, మాభాష, అజ్మతుల్లా, మారుతి నగర్ రఫీ, అబ్దుల్ రెహమాన్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పీ.వెంకటేశ్వర్లు, ఐసా నాయకుడు నాగార్జున, తదితర నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :