ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నంద్యాల జిల్లా ఆవాజ్ కమిటీ అధ్యక్షులు & సంఘసేవకుడు కీర్తిశేషులు అబుబక్కర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పట్టణ కమిటీ సభ్యులందరూ సమావేశమై ఈ నెల 21వ తేదీ ఆదివారం ఆత్మకూరు రోడ్డులో ఉన్న రాయల్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న సంస్మరణ సభ ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహిమాన్, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని, అన్ని మండలాల నుంచి అవాజ్ కమిటీ సభ్యులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, ఆత్మీయులు, మిత్రులు, సన్నిహితులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ ఈ సంతాప సభకు తప్పకుండా హాజరుకావాలని కోరడమైనది. ఈ సంస్కరణ సభకు మాజీ ఎమ్మెల్యే& ఆవాజ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఏ.గఫూర్ మరియు ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా చిస్తి, లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ రావడం జరుగుతుందని అన్నారు. ఈ సభకు సంఘ సేవకుడు అబుబక్కర్ సానుభూతి పరులందరూ తప్పకుండా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆవాజ్ పట్టణ నాయకులు అబ్దుల్లా, పెయింటర్ రఫీ, మహబూబ్ బాషా, మాభాష, అజ్మతుల్లా, మారుతి నగర్ రఫీ, అబ్దుల్ రెహమాన్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పీ.వెంకటేశ్వర్లు, ఐసా నాయకుడు నాగార్జున, తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News