ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ 57 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ 57వ స్థాపన దినోత్సవాన్ని నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పటేల్ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేసి కామ్రేడ్ చారుమజుందార్, కామ్రేడ్ వినోద్ మిశ్రా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాసు, నాగార్జున, మహిళా సంఘం నాయకురాలు బీబీ లు మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) పార్టీ నక్సల్బారి రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏప్రిల్-22, 1969 ఏర్పడి ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అమెరికా ఇజ్రాయిల్ దౌర్జన్యంగా ఇరాన్ లెబనాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్మించడం అత్యవసరమన్నారు. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దేశంలో ఒకవైపు కార్మికులు, రైతులు, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్నాయని కొత్త లేబర్ కోడ్లు, వ్యవసాయంపై ప్రభావం చూపే వాణిజ్య ఒప్పందాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళిత గిరిజన ఆదివాసి హక్కుల కోసం సిపిఐ(ఎం ఎల్)లిబరేషన్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని నిజమైన సార్వభౌమ, లౌకిక, సామ్యవాద దేశాన్ని నిర్మించడం కోసం ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(యమ్ యల్) లిబరేషన్ ఉమ్మడి జిల్లా నాయకులు టి.నరసింహులు, కాటేపోగు స్వామన్న, వేల్పుల.ఏసన్న, లింగాల శ్రీనివాసులు, పిక్కిలి మాధవ నాయుడు, మండ్ల శ్రీనివాసులు, మహబూబ్ బాషా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాళ్ళు ఎస్.బిబి, పి.మణికుమారి, ఎస్.నూర్జహాన్, వేల్పుల రాణమ్మ, నవ్వే సాని, శాంతి బాయి, ఎస్.షకీరా, శాలుబి, పసలిం సుల్తాన్, ఆర్ వై ఏ నాయకులు లింగాల శివకుమార్, దావీదు, శాంతిరాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News