Thursday, 30 July 2026 04:17:23 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

నక్సల్బారి స్ఫూర్తితో కొత్త పోరాటాలకు సిద్ధం కావాలి:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

Date : 22 April 2026 10:25 PM Views : 126

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ 57 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ 57వ స్థాపన దినోత్సవాన్ని నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పటేల్ సెంటర్‌లో జెండా ఆవిష్కరణ చేసి కామ్రేడ్ చారుమజుందార్, కామ్రేడ్ వినోద్ మిశ్రా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాసు, నాగార్జున, మహిళా సంఘం నాయకురాలు బీబీ లు మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) పార్టీ నక్సల్బారి రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏప్రిల్-22, 1969 ఏర్పడి ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అమెరికా ఇజ్రాయిల్ దౌర్జన్యంగా ఇరాన్ లెబనాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్మించడం అత్యవసరమన్నారు. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దేశంలో ఒకవైపు కార్మికులు, రైతులు, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్నాయని కొత్త లేబర్ కోడ్లు, వ్యవసాయంపై ప్రభావం చూపే వాణిజ్య ఒప్పందాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళిత గిరిజన ఆదివాసి హక్కుల కోసం సిపిఐ(ఎం ఎల్)లిబరేషన్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని నిజమైన సార్వభౌమ, లౌకిక, సామ్యవాద దేశాన్ని నిర్మించడం కోసం ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ(యమ్ యల్) లిబరేషన్ ఉమ్మడి జిల్లా నాయకులు టి.నరసింహులు, కాటేపోగు స్వామన్న, వేల్పుల.ఏసన్న, లింగాల శ్రీనివాసులు, పిక్కిలి మాధవ నాయుడు, మండ్ల శ్రీనివాసులు, మహబూబ్ బాషా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాళ్ళు ఎస్.బిబి, పి.మణికుమారి, ఎస్.నూర్జహాన్, వేల్పుల రాణమ్మ, నవ్వే సాని, శాంతి బాయి, ఎస్.షకీరా, శాలుబి, పసలిం సుల్తాన్, ఆర్ వై ఏ నాయకులు లింగాల శివకుమార్, దావీదు, శాంతిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :