Saturday, 13 June 2026 02:25:11 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఔరంగాబాద్‌లో భారత్ గౌరవ్ అవార్డు–2025 అందుకున్న వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షురాలు సయ్యద్ మెహతాజ్ బేగం

Date : 11 December 2025 05:35 PM Views : 211

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య జిల్లా/ రైల్వే కోడూరు : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10న మహారాష్ట్ర రాష్ట్రంలోని, ఔరంగాబాద్ నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “భారత గౌరవ్ అవార్డ్– 2025” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సయ్యద్ మెహతాజ్ బేగం భారత్ గౌరవ్ అవార్డు అందుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన మెహతాజ్ బేగం గత కొంతకాలంగా సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మానవ హక్కుల రక్షణ, బాధితుల పట్ల న్యాయం మరియు అవగాహన కార్యక్రమాల్లో విశేష సేవలను అందిస్తూ ముందంజలో నిలుస్తున్నారు. ఆమె చేసిన సమాజ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు అనేక కుటుంబాలకు ఆశాకిరణం అయ్యాయి. ఆమె సమాజ సేవలను పరిగణనలోకి తీసుకుని, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.అన్సారీ స్వయంగా ఆమెకు అవార్డు అందజేశారు. దేశం నలుమూలల నుండి ప్రతిభావంతులు, సేవాభావం కలిగిన వ్యక్తులు పాల్గొన్న ఈ అవార్డు కార్యక్రమంలో మెహతాజ్ బేగం పేరు వినిపించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గౌరవం లభించింది. అవార్డు స్వీకరించిన అనంతరం, తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్.మస్తాన్ సాహెబ్ కి సయ్యద్.మెహతాజ్ బేగం కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవ పట్ల తన కట్టుబాటును మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో మహిళల భద్రత, విద్య, హక్కుల పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మరింత శ్రమించి, కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగానికి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్రాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్న మెహతాజ్ బేగం కు భారత్ గౌరవ్ అవార్డు-2025 రావడం, ఆమె కృషి, ఈ సాధన, రైల్వే కోడూరు – అన్నమయ్య జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమై నిలిచిందనీ సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు ఆమె విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :