Tuesday, 28 July 2026 07:40:20 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కొట్టాలచెరువు చెంచుగూడెం బడి పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలి

జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షులు)

Date : 13 July 2026 10:01 PM Views : 68

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆత్మకూరు ప్రజా రవాణాశాఖ మేనేజర్ ను గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ మాట్లాడుతూ కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 30 మంది కురుకుంద ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని, ఆత్మకూరు పట్టణంలో కొంతమంది విద్యార్థులు చదువుతున్నారని, ఆటోలకు అధిక చార్జీలు ఇవ్వలేక బడిపిల్లలు సక్రమంగా బడికి రావటంలేదని, బాలకార్మికులుగా మారుతున్నారని, ఆత్మకూరు నుంచి కురుకుంద మీదుగా కొట్టాలచెరువు కు బడిపిల్లలకు అనుకూలమైన సమయం ఉదయం 8గంటలకు సాయంత్రం 4గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. కొట్టాల చెరువు చెంచుగూడెం ప్రత్యేక గిరిజన పంచాయితీ కావడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి కొట్టాలచెరువు చెంచుగూడెంకు బస్సు సౌకర్యం లేక చదువుకునే బడి పిల్లలతో పాటు, కాలేజీ విద్యార్థులు, వృద్దులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: