ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆత్మకూరు ప్రజా రవాణాశాఖ మేనేజర్ ను గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు జవహర్ నాయక్ మాట్లాడుతూ కొట్టాల చెరువు గ్రామం బడిపిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 30 మంది కురుకుంద ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని, ఆత్మకూరు పట్టణంలో కొంతమంది విద్యార్థులు చదువుతున్నారని, ఆటోలకు అధిక చార్జీలు ఇవ్వలేక బడిపిల్లలు సక్రమంగా బడికి రావటంలేదని, బాలకార్మికులుగా మారుతున్నారని, ఆత్మకూరు నుంచి కురుకుంద మీదుగా కొట్టాలచెరువు కు బడిపిల్లలకు అనుకూలమైన సమయం ఉదయం 8గంటలకు సాయంత్రం 4గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. కొట్టాల చెరువు చెంచుగూడెం ప్రత్యేక గిరిజన పంచాయితీ కావడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి కొట్టాలచెరువు చెంచుగూడెంకు బస్సు సౌకర్యం లేక చదువుకునే బడి పిల్లలతో పాటు, కాలేజీ విద్యార్థులు, వృద్దులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
E Nivas News