ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు నగరం పాతబస్తీ ఉస్మానియా కళాశాల ప్రాంగణంలోని బి.ఇడి. కళాశాల సమావేశ భవనమునందు వక్ఫ్ చట్టాల పుస్తక సమీక్ష కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమానికి పుస్తక రచయితా ఏఎండి.ఇంతియాజ్, విశ్రాంత ఐఏఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సరళ మైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 లో చేసిన సవరణలు, కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించానని, ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలని అన్నారు. తాను ప్రభుత్వం లో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నప్పుడు చాలా కోర్ట్ కేసులు పరిష్కరించాల్సి వచ్చేదని, ఆ విధంగా చట్టాలను చదివి వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయాలని అనిపించి ఎంతో భాద్యతతో ఈ పుస్తకాన్ని రచించానని అన్నారు. ఈ పుస్తకంలో అన్ని అంశాలను, కోర్ట్ తీర్పులను 16 అధ్యాయాయులుగా విభజించి సరళమైన రీతిలో అందరికి అర్థమయ్యేలా రాయడం జరిగిందన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఎంతో కృషి తో సరళమైన భాష లో అర్థమయ్యే విధంగా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఒక విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి పుస్తకం రాయడం అభినందించదగ్గ విషయమని ప్రశంశించారు. పుస్తక రచయితా ఏఎండి.ఇంతియాజ్, విశ్రాంత ఐఏఎస్ వారి గురువు కృష్ణా రెడ్డిని మరియు గాంధేయవాది కల్కూర చంద్ర శేఖర్ ని సన్మానించారు. ఈ పుస్తక సమీక్ష కార్యక్రమంలో వెంకట రామి రెడ్డి విశ్రాంత ఐపీఎస్ (లోక యుక్త, కర్నూలు), జనాబ్ జావీద్ రషీద్ సాబ్ (అబ్దుల్ హక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్), జనాబ్ జంషీద్ అలీ ఖాన్ సాబ్ (మెట్రో ఇండస్ట్రియలిస్ట్), రాజశేఖర్ (మాంటిసోరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్), జనాబ్ డా మన్సూర్ రెహమాన్ సాబ్ (కర్నూలు డిస్ట్రిక్ట్ ఇంటెలెక్టువల్ ఫోరం), ప్రొఫెసర్ సమీఉద్దీన్ సాబ్ (ప్రిన్సిపాల్ ఉస్మానియా కాలేజీ), ముస్లిం మైనారిటీ నాయకులు మరియు సాహిత్యభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News