Wednesday, 29 July 2026 12:06:26 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగివుండాలి

వక్ఫ్ చట్టాల రచయిత ఏఎండి. ఇంతియాజ్ (విశ్రాంత ఐఏఎస్)

Date : 13 February 2026 11:26 PM Views : 154

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు నగరం పాతబస్తీ ఉస్మానియా కళాశాల ప్రాంగణంలోని బి.ఇడి. కళాశాల సమావేశ భవనమునందు వక్ఫ్ చట్టాల పుస్తక సమీక్ష కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమానికి పుస్తక రచయితా ఏఎండి.ఇంతియాజ్, విశ్రాంత ఐఏఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సరళ మైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 లో చేసిన సవరణలు, కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించానని, ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలని అన్నారు. తాను ప్రభుత్వం లో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నప్పుడు చాలా కోర్ట్ కేసులు పరిష్కరించాల్సి వచ్చేదని, ఆ విధంగా చట్టాలను చదివి వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయాలని అనిపించి ఎంతో భాద్యతతో ఈ పుస్తకాన్ని రచించానని అన్నారు. ఈ పుస్తకంలో అన్ని అంశాలను, కోర్ట్ తీర్పులను 16 అధ్యాయాయులుగా విభజించి సరళమైన రీతిలో అందరికి అర్థమయ్యేలా రాయడం జరిగిందన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఎంతో కృషి తో సరళమైన భాష లో అర్థమయ్యే విధంగా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఒక విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి పుస్తకం రాయడం అభినందించదగ్గ విషయమని ప్రశంశించారు. పుస్తక రచయితా ఏఎండి.ఇంతియాజ్, విశ్రాంత ఐఏఎస్ వారి గురువు కృష్ణా రెడ్డిని మరియు గాంధేయవాది కల్కూర చంద్ర శేఖర్ ని సన్మానించారు. ఈ పుస్తక సమీక్ష కార్యక్రమంలో వెంకట రామి రెడ్డి విశ్రాంత ఐపీఎస్ (లోక యుక్త, కర్నూలు), జనాబ్ జావీద్ రషీద్ సాబ్ (అబ్దుల్ హక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్), జనాబ్ జంషీద్ అలీ ఖాన్ సాబ్ (మెట్రో ఇండస్ట్రియలిస్ట్), రాజశేఖర్ (మాంటిసోరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్), జనాబ్ డా మన్సూర్ రెహమాన్ సాబ్ (కర్నూలు డిస్ట్రిక్ట్ ఇంటెలెక్టువల్ ఫోరం), ప్రొఫెసర్ సమీఉద్దీన్ సాబ్ (ప్రిన్సిపాల్ ఉస్మానియా కాలేజీ), ముస్లిం మైనారిటీ నాయకులు మరియు సాహిత్యభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :