Monday, 14 September 2026 01:04:40 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగివుండాలి

వక్ఫ్ చట్టాల రచయిత ఏఎండి. ఇంతియాజ్ (విశ్రాంత ఐఏఎస్)

Date : 13 February 2026 11:26 PM Views : 192

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు నగరం పాతబస్తీ ఉస్మానియా కళాశాల ప్రాంగణంలోని బి.ఇడి. కళాశాల సమావేశ భవనమునందు వక్ఫ్ చట్టాల పుస్తక సమీక్ష కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమానికి పుస్తక రచయితా ఏఎండి.ఇంతియాజ్, విశ్రాంత ఐఏఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సరళ మైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 లో చేసిన సవరణలు, కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించానని, ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలని అన్నారు. తాను ప్రభుత్వం లో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నప్పుడు చాలా కోర్ట్ కేసులు పరిష్కరించాల్సి వచ్చేదని, ఆ విధంగా చట్టాలను చదివి వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయాలని అనిపించి ఎంతో భాద్యతతో ఈ పుస్తకాన్ని రచించానని అన్నారు. ఈ పుస్తకంలో అన్ని అంశాలను, కోర్ట్ తీర్పులను 16 అధ్యాయాయులుగా విభజించి సరళమైన రీతిలో అందరికి అర్థమయ్యేలా రాయడం జరిగిందన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఎంతో కృషి తో సరళమైన భాష లో అర్థమయ్యే విధంగా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఒక విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి పుస్తకం రాయడం అభినందించదగ్గ విషయమని ప్రశంశించారు. పుస్తక రచయితా ఏఎండి.ఇంతియాజ్, విశ్రాంత ఐఏఎస్ వారి గురువు కృష్ణా రెడ్డిని మరియు గాంధేయవాది కల్కూర చంద్ర శేఖర్ ని సన్మానించారు. ఈ పుస్తక సమీక్ష కార్యక్రమంలో వెంకట రామి రెడ్డి విశ్రాంత ఐపీఎస్ (లోక యుక్త, కర్నూలు), జనాబ్ జావీద్ రషీద్ సాబ్ (అబ్దుల్ హక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్), జనాబ్ జంషీద్ అలీ ఖాన్ సాబ్ (మెట్రో ఇండస్ట్రియలిస్ట్), రాజశేఖర్ (మాంటిసోరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్), జనాబ్ డా మన్సూర్ రెహమాన్ సాబ్ (కర్నూలు డిస్ట్రిక్ట్ ఇంటెలెక్టువల్ ఫోరం), ప్రొఫెసర్ సమీఉద్దీన్ సాబ్ (ప్రిన్సిపాల్ ఉస్మానియా కాలేజీ), ముస్లిం మైనారిటీ నాయకులు మరియు సాహిత్యభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :