Saturday, 12 September 2026 09:24:17 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రేషన్ డీలర్ల నిరసన ...! తమ సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ జి.సుభద్రమ్మకు వినతి పత్రం సమర్పించిన సంఘం నాయకులు

Date : 27 August 2026 08:21 PM Views : 119

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ప్రభుత్వ రేషన్ షాపుల డీలర్ల సంఘం అధ్యక్షుడు జి.నాగభూషణరావు, కార్యదర్శి ఎం.వి.సుధాకర్, ట్రెజరర్ ఎస్.టి. హుస్సేన్ సాహెబ్ ల ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని అందరితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు తహసీల్దార్ జీ.సుభద్రమ్మకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు జి.నాగభూషణం రావు, కార్యదర్శి ఎం.వి.సుధాకర్, ట్రెజరర్ ఎస్.టి.హుస్సేన్ సాహెబ్, తదితర నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న కమిషన్‌ను రూపాయి నుంచి మూడు రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి రెండు కార్డులకు ఒకేసారి 50 కిలోల బియ్యం కేటాయించే విధానాన్ని మార్చాలని, బియ్యం బస్తాలను కాటపై పెట్టే విధానాన్ని తొలగించాలని కోరారు. అలాగే ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్దే బియ్యం బస్తాలను తూకం వేసి, క్లియర్ కోడ్ స్కానింగ్ అనంతరం రేషన్ దుకాణాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపుల్లో స్కానింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందించాలని కోరుతూ తహసీల్దార్‌-జి.సుభద్రమ్మ కు డీలర్ల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ల సంఘం సభ్యులు కె.హైమావతి, బి.చంద్రకళ, ఎం.శేఖర్, ఎం.సునీల్, పి.గోపాలరెడ్డి, ఈ.మాణిక్యారావు, ఎస్.సంజన్న, ఎస్.తిరుపాలు, టి.శేషపని శర్మ, బి.సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :