ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో ఇస్లాం పేటకు చెందిన అర్షియాపై చెవికి. దవడపై కుక్క కలవడం జరిగింది. దాడిలో తీవ్ర గాయాల పాలైన, నిద్రమత్తు వీడని అధికార యంత్రాంగం, భయాందోళనలో ప్రజలు ఉన్నారు. చిన్నారి అర్షియా పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనీ గాయాల పాలైన చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. ఆత్మకూరులో చిన్న పిల్లలు తిరగాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. కుక్కల బెడదతో ఇంకెన్నాళ్లు చిన్నారులు, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాలనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడిలో గాయాల పాలవుతున్న అభం శుభం తెలియని చిన్నారులు ఎందరో ఉన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని, పట్టణంలో కుక్కల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుచున్నారు.
Admin
E Nivas News