ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : భారతరత్న సంఘసంస్కర్త ప్రపంచ మేధావి అనగారి ప్రజల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఘనకీర్తి ,మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని, మిడుతూరు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, మహిళా నాయకులతో కలిసి పూలమాలలువేసి, ఘనంగా అర్పించడం జరిగింది. ఈ సందర్భముగా నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు- టీ.షాజహాన్ బేగం మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు పురుషులతో సమానం మహిళలకు ఉద్యోగాలు సమాన చదువులు కల్పించినటువంటి మహనీయుడని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి నటువంటి ప్రతి అక్షరంలో బ్రతికే ఉన్నారు అని చెప్పారు. ఇలాంటి గొప్ప ఆదర్శమూర్తులను ఎప్పటికీ మరిచిపోకూడదని అంబేద్కర్ ఇచ్చినటువంటి భావాలను స్ఫూర్తిగా తీసుకొని జీవించాలని చెప్పడం జరిగింది. అంబేద్కర్ జ్ఞానం, ధైర్యం, లక్ష్యం, గమ్యాన్ని చూపిన చిరస్మరణీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు లీలావతి, లక్ష్మీదేవి, దేవమ్మ, కమలమ్మ ,హుస్సేన్, బి.మహబూబ్బి, దస్తగిరమ్మ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News