Tuesday, 28 July 2026 07:39:30 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 03 July 2026 06:23 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 లోని షెడ్యూల్ 6 మరియు కిందకు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు (జి.ఓ. ఎంఎస్.నెం-45) జారీ చేయడం పట్ల ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని మాట్లాడుతూ గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు డిమాండ్ లు సానుకూలంగా పరిశీలించి, కార్మికలోకానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ అన్నారు. ముఖ్యంగా 01-01-2022 నుండి పాత తేదీతో ఉత్తర్వులను వర్తింపజేయడం ద్వారా ఎంతోమంది సీనియర్ ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక దృక్పథం, మరియు యువ నాయకుడు నారా లోకేష్ చొరవతో ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల కోర్టు కేసుల ద్వారా సేవలో కొనసాగిన వారికి, విధుల్లో తిరిగి చేరే వారికి పూర్తి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఉన్న సత్సంబంధాలకు ఈ జీవో ఒక నిదర్శనం అని అన్నారు. విద్యాశాఖ మరియు దాని అనుబంధ సొసైటీలలోని, ఉద్యోగులందరి తరపున ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :