Friday, 11 September 2026 10:13:26 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

చనిపోయిన తర్వాత నేత్రదానం చేయండి-కళ్ళు లేని వారికి వెలుగును ఇవ్వండి:-పి.షేక్షావలి(కంటి వైద్య నిపుణులు)

Date : 25 August 2026 10:01 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ కళ్ళను దానం చేయండి-గ్రుడ్డివారికి వెలుగులు ఇవ్వండి అని కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆత్మకూరులోని, ఆదిత్య జూనియర్ కళాశాలలో మంగళవారం నేత్రదాన అవగాహన వైద్య శిబిరాన్ని కంటి వైద్యులు పి.షేక్షావలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నేత్రదానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆగస్టు-25 నుంచి సెప్టెంబర్-8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేత్రదానం ద్వారా మరణానంతరం ఇద్దరు అంధులకు చూపు కల్పించే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. మరణించిన వ్యక్తి నుంచి వీలైనంత త్వరగా, సాధారణంగా ఆరు గంటల్లోపు కార్నియాను సేకరించడం ద్వారా చూపులేని వారికి వెలుగును అందించవచ్చని తెలిపారు. నేత్రదానం చేయడం వల్ల దాత కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, నేత్రాలను సేకరించే ప్రక్రియ తక్కువ సమయంలోనే పూర్తవుతుందని చెప్పారు. వయస్సుతో సంబంధం లేకుండా అనేక సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని, ప్రజలు అపోహలను వీడి నేత్రదానానికి ముందుకు రావాలని వైద్యులు సూచించారు. కంటి చూపు కోల్పోయిన వారికి వెలుగును అందించడం ద్వారా మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా నేత్రదాన ప్రాధాన్యతను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ నాయుడు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: