ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు గ్రామ సర్పంచ్ మేకల.భాగ్యమ్మ, ఆమె కుమారుడు మేకల.రాజశేఖర్ నేషనల్ హైవే ఎన్హెచ్ 340సి నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు వీది లైట్ల కోసం కొత్త విద్యుత్తు స్తంభాల లైన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ, ఆమె కుమారుడు మేకల రాజశేఖర్ మాట్లాడుతూ ఈ నూతన లైన్ వలన తహసిల్దార్ కార్యాలయానికి, వెలుగు కార్యాలయానికి, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, గ్రామ సచివాలయానికి, హౌసింగ్ ఏఈ కార్యాలయానికి, భారత్ గ్యాస్ గోడౌన్ కు, తదితర అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, భవిష్యత్తులో ప్రజలకు అన్ని వసతులకు పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, విద్యుత్తు సిబ్బంది, తదితర వర్కర్లు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News