ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / : కోనసీమ జిల్లా : తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, మురముళ్ళ గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు స్థానిక ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే సుబ్బరాజు, అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనందరావు లతో కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ప్రజలు, సంక్రాంతి సంబరాల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. మన మూలాలను గుర్తు చేసుకునే ఈ పండుగను మీ అందరి మధ్య జరుపుకోవడం ఆనందంగా, సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు తమ మాతృభాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే. ఆ సంస్కృతి బతికేలా, గ్రామీణ జీవనం బాగుపడేలా నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంప్రదాయాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి సేవలో కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వశిష్ఠ గోదావరి తీరాన వెలసిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారికి దర్శించుకున్నారు. అంతకు ముందు క్షేత్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే బుడ్డా కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట కే.సి.కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, నాయకులు అన్నారపు శేషిరెడ్డి, వై.యుగంధర్ రెడ్డి తదితరులున్నారు.
Admin
E Nivas News