Saturday, 13 June 2026 12:17:36 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

పి ఆర్ టి యు

Date : 25 November 2025 06:28 PM Views : 1878

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు 3వ వంతు ఉపాధ్యాయులు నైట్ డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, పలు ప్రాథమిక, ఉన్నత, గిరిజన సంక్షేమ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదులు చేయించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రధాన సమస్యలు ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ ను నియమించాలనీ, కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేయాలనీ, పదో తరగతి పరీక్షల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలనీ, మహిళ ఉపాధ్యాయులకు, పిల్లల వయస్సు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే అనే నిబంధన తొలగించి చైల్డ్ కేర్ లీవ్ జీవో విడుదల చేయాలనీ, ఉపాధ్యాయుల పెండింగ్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలనీ, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలనీ, డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలనీ, సిపిఎస్ రద్దు కోసం కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్టియు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు చంద్రశేఖర్, కలిముల్లా, హుస్సేన్ సాహెబ్, రషీద్, ఖాజా, మీర్ ఇబ్రాహీం, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :