ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : దేశ పోరాటం న్యూస్ పాములపాడు:-సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాములపాడులోని, సాంఘిక సంక్షేమ వసతి గృహంలో (ఎస్సీ గర్ల్స్ హాస్టల్) బాల బాలికలకు మెటీరియల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హాస్టల్లో అందుతున్న సదుపాయాలు, చదువుకునే వాతావరణం, భోజన వసతి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అధికారులతో, నాయకులతో కలిసి విద్యార్థినులకు ట్రంక్ పెట్టెలు (బాక్సులు), ప్లేట్లు, గ్లాసులు, బెడ్షీట్లు, కార్పెట్లు, టర్కీ టవళ్లు, స్వెట్టర్లు, నైట్ డ్రస్సులు, షూలు, సాక్సులు, తదితర వస్తువులను అందజేశారు. అనంతరం పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామానికి చెందిన జాల శ్రీకాంత్ యాదవ్ కి సంబంధించిన 1,40,343/- సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుని తండ్రి జాల కృష్ణమోహన్ కి ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం.వి.శివారెడ్డి, ఏఎస్ డబ్ల్యూ ఓ-కె.సి.రాముడు, ఆత్మకూరు రూలర్ సిఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎంఈఓ-1 బాలాజీ నాయక్, విబిజి రామ్ జి పథకం ఏపీవో బి.జయంతి, పాములపాడు ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ డి అనిత విజయకుమారి, నియోజవర్గంలోని ఇతర హాస్టల్ల వార్డెన్ లు ఉమాదేవి, మహేశ్వరుడు, విజయ్, రవికుమార్, కరుణలత, రుద్రవరం టీడీపీ నాయకులు రాచపూడి సురేష్, మధుసూదన్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, మండల నాయకులు హరినాథ్ రెడ్డి, తిమ్మారెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల జనార్ధన్ రెడ్డి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, జూటూరు హాఫీజ్, పూసల కృష్ణయ్య, ఉన్నం రాము, ఆంజనేయులుగౌడ్, లింగస్వామి, జిల్లా ఎస్ఎస్సి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, హెడ్ కానిస్టేబుల్ ఎం.వి.రమణ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సువర్చల, పి ఆర్ జెఈ రాఘవేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News