ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈ రోజు ఎంఈఓ,-2 ఏ.సుభాషిణి దేవి రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాములపాడు మండల ఎంఈఓ-1 బాలాజీ నాయక్ పాల్గొనగా, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.శ్రీధర్ రెడ్డి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. కార్యక్రమం మధ్యలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమం పూర్తి అయిన పిమ్మట విద్యార్థులకు, వచ్చిన అతితులందరికి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ.సుభాషిణి దేవి విద్యా వ్యవస్థలో సుమారురుగా 36 సంవత్సరాలు పనిచేయడం జరిగిందన్నారు. అనంతరం అందరూ ఏ.సుభాషిణి దేవికి ఎంఈఓ బాలాజీ నాయక్ మరియు మండలంలోని ఉపాధ్యాయులందరూ శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ కలబండి.రాజశేఖర్, హైమావతి, శారద, మనోరంజని, స్వామి శేఖర్, దామరేకుల రవి, సుబ్బనాయక్, రాంప్రసాద్, నజీర్ భాష, శ్రీనివాసులు, ఖాజా హుస్సేన్, ద్రాక్షాయని బాయి, సుహాసిని, చిన్న భారతి, శివ నాగలక్ష్మి, జయలత, విజయబాబు, ఏ.సుధాకర్, మల్లిక, రవీంద్ర నాయుడు, రమణి బాయి, మురళి రంగారెడ్డి, రామకృష్ణ, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్, రామమూర్తి, మరియు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News