Monday, 14 September 2026 03:29:09 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బెంగళూరు బోర్డు పరీక్షల్లో పాములపాడు విద్యార్థిని ప్రతిభ

కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్

Date : 22 April 2026 10:15 PM Views : 492

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లాలోని, పాములపాడు గ్రామానికి చెందిన రాయపాటి రాఘజ్ఞపిక కర్ణాటక ప్రీ-యూనివర్సిటీ బోర్డు పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మల్ పీ యు కాలేజీలో పి.సి.ఎం.ఈ కోర్స్ లో ఫిజిక్స్ , కెమిస్ట్రీ , మాథమాటిక్స్ , ఎలక్ట్రానిక్స్ కోర్సు చదువుతున్న రాగ జ్ఞాపిక, బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తన మేధస్సును చాటుకున్నదని శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్. గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఆర్. గోపాల్ మాట్లాడుతూ కర్ణాటక ప్రీ యూనివర్సిటీ బోర్డు ఎగ్జామ్స్ లో విజయకేతనం ఎగురవేశారు . ఎలక్ట్రానిక్స్ లో 100/100 పర్ఫెక్ట్ స్కోరు సాధించి గ్రామీణ విద్యార్థులు సైతం నగర ప్రాంత విద్యార్తులతో పోటీ పడి చదువగలమని 91% తో 547/600 మార్కులు సాధించి నిరూపించారు. గ్రామీణ ప్రాంతం నుండి నగర విద్యార్థులకు ధీటుగా రాణిస్తూ ఎలక్ట్రానిక్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టులో 91%తో నూటికి నూరు మార్కులు సాధించడం విశేషం. *అభినందనల జల్లు* రాగ జ్ఞపిక సాధించిన ఈ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు. శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్, తల్లిదండ్రులు రాయపాటి గోపాల్ - రాయపాటి.శ్రీదేవి లు, మండల విద్యాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, సామాజికవేత్తలు అభినందించారు. ముఖ్యంగా ఆమె బెంగుళూరు లో డిస్టిక్షన్ సాధించి పునాది వేసిన బెంగళూరు మౌంట్ కార్మేల్ ప్రీ యూనివర్సిటీ లో పి.సి.ఎమ్.ఈ. ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయులు స్మితాపాల్, పావన, లత, రేస్మా, అమృత, జోష్ణ, కవిత, రోజ్ మేరీ, సుజాత ఉపాధ్యాయ బృందం ప్రోత్సాహం వల్లే పిసియం ఈ ప్రి యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో డిస్టిక్షన్ సాధించానని పాములపాడు విద్యార్థి రాయపాటి రాగ జ్ఞాపిక ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదములు తెలిపారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులో 100/100 సాధించడానికి ఎంతో ప్రోత్సాహం అందించిన స్మితా పాల్ కు ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకమని విద్యార్ధి రాగ జ్ఞాపిక విద్యా స్ఫూర్తిని వ్యక్తం చేసారు. పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం బాలకృష్ణమ్మ , షాజహాన్, సురేంద్ర, నారాయణ, హబీబుల్లా, రామస్వామి, విజయ్, జయలక్ష్మమ్మ, పుష్ప, రాణి కళావతి, గాయత్రీ, శ్రీలక్ష్మి పాఠశాల సిబ్బంది విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాగ జ్ఞపిక భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. "లక్ష్యం స్పష్టంగా ఉంటే భౌగోళిక సరిహద్దులు అడ్డంకి కావని రాగ జ్ఞాపిక నిరూపించింది. ఎలక్ట్రానిక్స్‌లో 100/100 మార్కులు, మొత్తం 547/600 మార్కులు బెంగళూరు మౌంట్ కార్మల్ కాలేజీలో చదువుతూ, బెంగుళూరు మౌంట్ కార్మల్ పి యూ కాలేజ్ టాప్-5 లో 91% మార్కులతో నిలిచారు. మండల విద్యాధికారులు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రాగ జ్ఞాపికకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :