ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, నిర్లక్ష్యం చేసిన మిడుతూరు ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజవర్గంలోని, మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఉదయం పూరి, ఆలు కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, పూరికి నూనె ఖర్చు అవుతుందని ఒట్టి చపాతి ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి పిల్లల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కనీసం వార్డెన్ అందుబాటులో లేకుండా స్టోర్ రూమ్ తాళం చేవి పని మనుషులకు ఇవ్వకుండా, అందుబాటులో లేకుండా ఉన్న వార్డెన్, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థమవుతుందని హాస్టల్లో కనీసం శుభ్రం చేసే స్వీపర్ కూడా దిక్కు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంట రూములో ఉప్పు గాని, మంచి నూనె గాని, కూరగాయలు గాని లేకుండా ఖాళీ వంట రూము ఉందని చాలీసాలని సరుకులు తెచ్చి, పిల్లల కడుపు కొడితే సహించేది లేదని ఆయన అన్నారు. హాస్టల్ వార్డెన్ పై కలెక్టర్ కు, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇరిటి.పెద్దన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News